ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న‌ ఏపీ విద్యార్థులు స‌హ‌క‌రించాలి-ఏపీ మంత్రి బొత్స‌


ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేవ‌న్నారు ఆ రాష్ట్ర మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఎక్క‌డివారు అక్క‌డే ఉండాల‌ని కోరారు. ఏపీ విద్యార్థుల‌కు ఎలాంటి  ఇబ్బందులు రాకుండా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో మాట్లాడ‌మ‌ని చెప్పారు. అటు కేంద్ర నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తామ‌ని చెప్పారు. ఇక స‌రిహ‌ద్దుల్లో చిక్కుకున్న‌వారి గురించి ఆలోచిస్తున్నామ‌ని చెప్పిన బొత్స‌..14రోజుల క్వారంటైన్‌కు అంగీక‌రిస్తే రాష్ట్రంలోకి అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.