కార్మికుల కడుపు నింపుతున్నాం: మంత్రి మల్లారెడ్డి


లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికుల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. కార్మిక సోదరులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు.